Thursday, 6 November 2014

The Way To Heaven Ministries

ఉదయంచిన నీతి సూర్యుడు


                   ప్రతి ఏటా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు యేసు ప్రభుని జన్మదినాన్ని ఓ పండుగగా.. ఓ మహోత్సవంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. వాస్తవానికి ఆయన డిసెంబర్ 25నే జన్మించాడనటానికీ చెప్పటానికీ తగిన ఆధారాలు లేవు. ప్రాచీన మధ్యప్రాచ్యంలో ప్రసిద్ధికెక్కిన కొన్ని మతాల వారు ఆ రోజును సూర్యుని జన్మదినంగా ఎంచి ఆరాధించటం ఆనవాయితీగా వస్తోంది. లోకాన్ని వెలుగుమయం చేస్తూ సకల జీవులకూ ప్రాణమిస్తూ పోషించే సూర్యుని పూజించేవారు. నేటికీ అరుణోదయ సూర్యుని వీక్షించి నమస్కారాలు చేయటం పరిపాటి. 
                  యేసుక్రీస్తు  జన్మించటానికి కొన్ని శతాబ్దాల మునుపే ప్రవక్తలు, భక్తులు ఆయనను నీతి సూర్యుడని ప్రస్తుతించారు. మలాకీ అనే భక్తుడు దేవుని నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని ప్రవచించారు. అతనికి ముందు యెషయా అనే మరో దైవజనుడు ఆ నీతి సూర్యోదయం జరిగినప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారనీ.. ఆ వెలుగు మరణచ్ఛాయగల దేశ నివాసుల మీద ప్రకాశిస్తుందని తెలియజేశాడు. తమస్సు నుండి జ్యోతి లోనికి నడిపించే వాని కొరకు, అతని ఆగమనం కొరకు అనేక భక్తులు ఎదురుచూశారు. ప్రార్థించారు. ఆ ప్రార్థనల నిరీక్షలకు జవాబు జగత్ జ్యోతియైన యేసుని జననం. డిసెంబర్ 25న స్పష్టమైన సూర్యుని జన్మదినంగా భావించి పూజించిన రోజునే నీతి సూర్యుడైన యేసుని జన్మదినంగా ఎంచి ఆయనను పూజించటం ప్రారంభించారు. యేసు నీతి సూర్యుడు. లోకాన్ని ఆవరించిన చీకటిని పారద్రోలి లోకాన్ని వెలిగించేందుకు ఆయన వచ్చాడు. యేసు నోటి నుండి వెలువడిన సప్త మహా వాక్యాలను, అహమేవ (నేను నేనే) అనే పదంతో ప్రారంభమయ్యే వాక్యాలలో ఒకటి ‘అహమేవ జగత్యోజ్యోతి’ ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగి ఉందురు. 
                            ఆయనతో మూడున్నర సంవత్సరాలు సహవసించి ఆయనను క్షుణ్ణంగా ఎరిగిన ఆయన శిష్యుడొకరు ఆయన జీవిత కథను గ్రంథస్థం చేస్తూ ఉపోద్ఘాతంలో ‘ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాని గ్రహింపలేదు. నిజమైన వెలుగు అయిన యేసు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు’ అని రాస్తాడు. 
                         యేసుక్రీస్తు నరావతార ఉద్దేశాలను గమనిస్తే, ఒకటి ప్రధానంగా కనపడుతుంది. పాపి విమోచన, దీన జనోద్ధరణ. ఆయనను నిందిస్తూ విరోధులు హేళనగా పాపులను చేర్చుకొని వారితో మిత్రత్వం చేస్తున్నాడని చెప్పినా అదే ఆయన నరావతార ఉద్దేశం. దుష్టుడు తన దౌష్ట్యాన్ని గుర్తించి ఆ జీవితానికి స్వస్థి పలికి నీతియుక్తమైన జీవితాన్ని జీవించటానికి అవసరమైన సహాయాన్ని, శక్తిని అనుగ్రహించుట ద్వారా వారిని విమోచిస్తాడు. ఆయన దుష్టులను, పాపులను విమోచించుటకే వచ్చాడు అనే సత్యాన్ని అనుభవించి తెలుసుకున్న పౌలు అనే వ్యక్తి చెప్పిన మాట ‘పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మతగినది. పూర్ణాంగీకారమునకు తగినది’ - ఈ మాట అనుభవజ్ఞానం చెప్పిన గొప్ప మాట. ఒకప్పుడు హానికరుడు దోషకారుడు, హింసకుడైన తనను యేసు తన దివ్య దర్శనముతో ఏలాగు నూతన జీవితాన్ని ప్రసాదించాడో ఓ సాక్షిగా.. వ్రాతపూర్వకంగా తెలియజేశాడు. యేసుప్రభువే తన నరావతార ఉద్దేశాన్ని తెలుపుతూ ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చితిని’ అని చెప్పాడు. ఇంకా ఆయన తన రాక ఉద్దేశాన్ని తెలుపుతూ తాను ఓ మంచి కాపరిననీ, గొర్రెలకు అనగా నరగొర్రెలకు సమృద్ధ జీవము యిచ్చుటకు వచ్చానని, ఆ సమృద్ధ జీవము తన బలియాగము ద్వారా కలుగుతుందని వివరణ ఇచ్చాడు. యేసు అవతరణ తత్త్వాన్ని లక్ష్యాన్ని తెలియజేసే ప్రకటన ఇది.
               నజరేతు అనే ఊరిలోగల ఓ ప్రార్థనా స్థలంలో బీదలకు శుభకరమైన వర్తమానమును ప్రకటించుటకు, చెరలోనున్నవారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపునిచ్చుటకు, నలిగిన వారిని విడిపించుటకు తన తండ్రియైన దేవుడు తనను అభిషేకించి పంపియున్నాడని తెలియజేశాడు. పేద దళిత జనోద్ధరణే తన నరావతార ఉద్దేశమని నిర్ద్వంద్వంగా ఆయన తెలియజేశాడు. తాను గర్భస్థ శిశువుగా వుండగానే ఆయన పుట్టుక దీనులకు బీదలకు ఎట్లు దీవెనకరంగా ఉంటుందో ఒక గేయ రూపంలో హృద్యంగా వివరించింది. ఆయన గర్వాంధులను చెదరగొట్టుతాడు. దీనులను ఉద్ధరిస్తాడు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి వారిని అందలమెక్కిస్తాడని కొనియాడింది. దీనులలో వుండే దివ్యత్వాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాడాయన. దీనులైన వికలాంగుల పట్ల రోగుల పట్ల అన్నార్తుల పట్ల ఆయన చూపిన ఆదరణ అపూర్వమైంది. 
             మొదటి శతాబ్దంలో సమాజం వర్గ సమాజంగా చీలిపోయింది. సాంఘిక తారతమ్యాలు పాటించబడ్డాయి. ధనంతోపాటు యాజకత్వము, వేద పరిజ్ఞానము సాంఘిక విభేదాలకు దారి తీశాయి. వేద పరిజ్ఞానం లేనివారిని, ధనిక వర్గానికి చెందని బీదలను ‘్భమిపుత్ర’ అని పిలువబడి, హీనంగా చూడబడ్డారు. నరావతారిగా ఉన్నపుడు ఆయన ఈ భూమిపుత్ర లేక బహుజనులతో మమేకమయ్యాడు. అట్టివారిలో కొందరిని ఆయన తన శిష్యులుగా వుండటానికి పిలిచాడు. వెలివేయబడ్డ వారి ప్రక్కన నిలిచి వారిని ఉద్ధరించాడు. వారితో కలిసి తిరగటం, కలిసి భోజనం చేయడం, బోధించడం, స్వస్తి చేయటం నేరాలుగా ఆయన విమర్శకులు తలంచారు. అలా కలిసి తిరగటం ఆయన సమర్థించుకోవటమే కాక దళిత దీన జనోద్ధరణ పథకంలో తనతో పాలిభాగస్తులలు కావాలని తన విమర్శకులను ఆహ్వానించాడు. 
                 మరియ కుమారుడు బీదలను, దీనులను దోచుకొనే దోపిడీ వర్గానికి ఓ సవాలు. ప్రతి క్రిస్మస్ విమోచనా ఆధ్యాత్మిక, పోరాడే ఆధ్యాత్మికతను అలవరచుకోమని సకల మానవాళిని సవాలు చేస్తోంది. 
                    శాంతాక్లాజ్: క్రీ.శ.4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే బిషప్ ఉండేవాడు. ఇతడు ఆసియా మైనర్‌లోని మైరా అనే ప్రాంతవాసి. ఇది నేటి టర్కీలోని ప్రాంతం. నికోలస్ అత్యంత ధనవంతుడు. ఐతే - అతడు ఏ మాత్రం గర్వంకానీ.. అధికార దర్పం గానీ ప్రదర్శించేవాడు కాదు. సాటి మనిషిని తనకంటే మిన్నగా ప్రేమించేవాడు. దయ, కరుణ అతడికి పెట్టని ఆభరణాలు. పేదలకు ఆశ్రయాన్ని కల్పించేవాడు. కరుణ చూపేవాడు. వారిని ఆపదలో ఆదుకోవటమే కాదు - శాశ్వత జీవన భృతిని కల్పించేవాడు. యేసుక్రీస్తు జన్మదినాన పిల్లలకూ వృద్ధులకూ గిఫ్ట్‌లను అందజేసేవాడు. క్రిస్మస్ తాత తమకు బోలెడన్ని బహుమతులను ఇచ్చాడని పిల్లలు చెప్పుకొనేవారు. ఐతే - నికోలస్ క్రిస్మస్ తాతకు ప్రత్యేకించి ఓ రూపం లేదు. ఇది జరిగిన చాన్నాళ్లకు అంటే 1931లో సాఫ్ట్‌డ్రింక్ కోకాకోలా సంస్థ శీతాకాలంలో తమ ప్రొడక్ట్‌ని మార్కెట్ చేసేందుకు స్వీడిష్ ఆర్టిస్ట్ హేడన్ సన్‌బ్లామ్‌తో స్కెచ్ వేయించారు. బాన కడుపు.. చిరునవ్వుల ముఖారవిందం మాటున వొతె్తైన తెల్లటి గడ్డం.. రెడ్ సూట్‌లో వింతగొలుపుతూ మొట్టమొదటి ‘శాంటాక్లాజ్’ రూపం ప్రజల్లోకి వచ్చింది. అది మొదలు నికోలస్ ‘శాంతాక్లాజ్’గా వస్తూంటాడన్న ప్రచారం జరిగింది. 
                      క్రిస్మస్ ట్రీ: ఇంగ్లండ్‌లో క్రైస్తవ్యం వేళ్లూనుకుంటున్న రోజులు. విల్‌ఫ్రెడ్ అనే ఫాదర్ ఓ రోజు ప్రార్థన చేస్తూండగా పక్కనే ఉన్న ‘ఓక్’ చెట్టు వొరిగింది. ‘ఓక్’ చెట్టుని ఆ తెగ వారు ఆరాధనలో భాగంగా భావిస్తారు. ఇలా జరగటం శుభ సూచకమనీ.. చెట్టు కాండం అంతంలేని జీవితానికి సంకేతం.. పచ్చని ఆకులు నిత్య జీవానికి మార్గం.. కాబట్టి ఈ చెట్టుతో ‘క్రిస్మస్ ట్రీ’ని భావిద్దామని అన్నాడాయన. దాంతో ఆ చెట్టు కొమ్మలకు రకరకాల బహుమతులను వేలాడదీయటం... అలంకరించటం చేస్తూ వచ్చారు. క్రిస్మస్ ట్రీని కొవ్వొత్తులతో అలంకరించి వాటిని వెలిగించిన మొదటి వ్యక్తి మార్టిన్ లూథర్ అని ఒక మాట ప్రచారంలో ఉంది. జర్మనీ వాసులు క్రిస్మస్ ట్రీని బాతు ఈకలతో చేయటం ఆనవాయితీ. క్రీ.శ.16వ శతాబ్దంలో జర్మన్లు క్రిస్మస్ ట్రీని మొట్టమొదటిగా ప్రారంభించినట్టు చరిత్ర కథనం. 
                           క్రిస్మస్ కలర్స్: క్రిస్మస్ వేడుకల్లో తరచూ ఎరుపు, పచ్చ, బంగారు వర్ణాలు కనిపిస్తాయి. ఎరుపు - క్రీస్తు రక్తానికి సంకేతం. పచ్చ - జీవానికి గుర్తు. బంగారు - ప్రకాశతకు, వెలుగుకు ముఖ్యంగా క్రీస్తు రాజరికానికి గుర్తుగా పేర్కొంటారు. 
                        జింగిల్ బెల్స్: అమెరికన్లు క్రిస్మస్ సందర్భంగా పాడే పాటల్లో ఇదొకటి. జేమ్స్ లార్డ్ ప్రియర్ పాంట్ (1822 - 1893) ఈ పాటని రాశాడు. 1850లో రాసిన ఈ పాటను బోస్టన్ సండే స్కూల్ పిల్లలు మొట్టమొదటిసారిగా పాడారు. అప్పట్నుంచీ ‘్థంక్స్ గివింగ్’ పాటగా ఇది ప్రాచుర్యం పొందింది. ‘జింగిల్ బెల్స్’ అనేవి గుర్రం మెడలోని గంటలు. క్రిస్మస్ సమయం: * క్రిస్మస్ సమయం ఎదురుచూసే సమయం * క్రిస్మస్ కాలం స్వస్థతా కాలం * క్రిస్మస్ కాలం ఓపిక చూపే సమయం * క్రిస్మస్ కాలం దాతృత్వ సమయం * క్రిస్మస్ కాలం గ్రహింపు కాలం * క్రిస్మస్ సమయం పిల్లల సమయం * క్రిస్మస్ కాలం నేర్చుకొనే కాలం * క్రిస్మస్ సమయం ప్రేమించే సమయం * క్రిస్మస్ సమయం జ్ఞాపకం చేసుకొనే సమయం. క్రిస్మస్ శాంతి ప్రార్థన:

ప్రభూ! నీ శాంతి సాధనంగా నన్ను వాడుకో
ఎక్కడ ద్వేషమో అక్కడ ప్రేమను/ ఎక్కడ గాయమో అక్కడ క్షమను
ఎక్కడ అనుమానమో అక్కడ విశ్వాసాన్ని
ఎక్కడ నిరాశో అక్కడ నిరీక్షణను/ చీకటి ఉన్నచోట వెలుగును
దుఃఖమున్న చోట ఆనందాన్ని/ నన్ను నాటనిమ్ము!
పరమ గురువైన ఓ ప్రభూ!/ నేను ఆదరించాలని కోరబడక
ఆదరించేలా ఇతరులు నన్ను గ్రహించాలని కోరుకునే దానికంటే
ఇతరులను గ్రహించటాన్ని నాకు నేర్పించు!/ ప్రేమించబడాలని కోరుకొనక
ప్రేమించటానికి నన్ను అపేక్షింపనిమ్ము!/ ఎందుకనగా-
ఇవ్వటం వలన తిరిగి మాకు దొరుకుతుంది/ క్షమించటం వలన క్షమ నొందుతాము
చనిపోవటం ద్వారా తిరిగి నిత్య జీవము కొరకై లేస్తాము.



--------------------------------------------------------------------------------------------------------------------------------
యేసు రోగులను స్వస్థపరచడం

యేసు దేశమంతటా ప్రయాణిస్తున్నప్పుడు రోగులను స్వస్థపరిచేవాడు. ఆయన చేసిన అద్భుతాల గురించిచుట్టుప్రక్కల గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజలకు తెలిసిపోయేది. కాబట్టి ప్రజలు అంగవిహీనులను, గ్రుడ్డివాళ్ళను, చెవిటివాళ్ళను, ఇతర వ్యాధులతో బాధపడేవారిని చాలామందిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చేవారు. యేసు వాళ్ళందరినీ స్వస్థపరిచేవాడు.
యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చి అప్పటికి మూడు సంవత్సరాలకంటే ఎక్కువకాలం గడిచింది. యేసు తాను
త్వరలోనే యెరూషలేముకు వెళతానని, అక్కడ తాను చంపబడతానని, ఆ తర్వాత మృతులలోనుండి తిరిగి
లేపబడతానని తన అపొస్తలులకు చెప్పాడు. అలా జరిగేంతవరకూ యేసు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూనే
ఉన్నాడు.
ఒకరోజు యేసు సబ్బాతు దినాన బోధిస్తున్నాడు. సబ్బాతు యూదులకు విశ్రాంతి దినం. చిత్రంలో మీకు కనిపిస్తున్న ఆ స్త్రీ వ్యాధిగ్రస్తురాలు. ఆమె 18 సంవత్సరాలుగా అలా వంగిపోయి ఉంది, ఆమె సరిగ్గా నిలబడలేకపోయేది. యేసు ఆమెపై తన చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమె స్వస్థతపొందింది!
అది చూసి మతనాయకులకు చాలా కోపం వచ్చింది. వారిలో ఒకడు ‘మనం పని చేయడానికి ఆరు రోజులు ఉన్నాయి. స్వస్థపరచబడడానికి రావలసింది ఆ రోజుల్లోనే కానీ విశ్రాంతి దినాన కాదు!’ అని అరిచాడు.
అందుకు యేసు, ‘చెడ్డ మనుష్యులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినాన తన గాడిదను విప్పి తోలుకొని వెళ్ళి దానికి నీళ్ళు పెడతాడు. పద్దెనిమిది సంవత్సరాలనుండి వ్యాధితో బాధపడుతున్న ఈ స్త్రీ విశ్రాంతి దినాన స్వస్థపరచబడకూడదా?’ అన్నాడు. యేసు అన్న మాటలకు ఆ చెడ్డ మనుష్యులు అవమానంతో తలవంచుకున్నారు.
తర్వాత యేసు, ఆయన అపొస్తలులు యెరూషలేము వైపుకు ప్రయాణమై వెళ్ళారు. వాళ్ళు యెరికో పట్టణం వెలుపలికి చేరుకోగానే ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిలో వెళ్తున్నాడన్న సంగతి విని, ‘యేసూ మాకు సహాయం చెయ్యి!’ అని కేకలు వేశారు.
యేసు ఆ గ్రుడ్డివాళ్ళను తన దగ్గరకు పిలిచి ‘నేను మీకు ఏమి చెయ్యాలి?’ అని అడిగాడు. అందుకు వాళ్ళు ‘ప్రభువా, మా కళ్ళు తెరిపించు’ అన్నారు. యేసు వాళ్ళ కళ్ళను ముట్టుకున్నప్పుడు వెంటనే వాళ్ళు చూడగలిగారు! యేసు ఇలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఎందుకు చేసేవాడో మీకు తెలుసా? ఎందుకంటే ఆయన ప్రజలను ప్రేమించాడు, వాళ్ళు తనపై విశ్వాసముంచాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన రాజుగా
పరిపాలించేటప్పుడు భూమ్మీద ఎవ్వరూ వ్యాధులతో అని మనం నమ్మకంతో ఉండవచ్చు

























No comments:

Post a Comment